
జనరల్

హైదరాబాద్లో ప్రముఖ కేఫ్లు, స్నాక్ పాయింట్లపై టీజీ సేఫ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. తొమ్మిది ప్రత్యేక బృందాలతో మొత్తం 19 కేఫ్లు, స్నాక్ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా, పలు కేంద్రాల్లో ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఆహార తయారీ, నిల్వ ప్రాంతాల్లో తీవ్ర అపరిశుభ్రతతో పాటు దుమ్ము, ధూళి పేరుకుపోయిన పరిస్థితులు కనిపించాయి.
కొన్ని కేంద్రాల్లో డ్రైనేజీలకు సమీపంలోనే ఆహార పదార్థాలను నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలతో పాటు ఈగలు, బొద్దింకల బెడద ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆహార పదార్థాల తయారీ, నిల్వ విషయంలో నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!