

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా సముదాయం వద్ద వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన కుమారులు మొస్తఫా, మెయిసమ్, మసౌద్ ఖమేనీ పాల్గొన్నారు. అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘెర్ ఘాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, సీనియర్ సైనిక అధికారులు కూడా హాజరయ్యారు. అయితే ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కార్యక్రమానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
భద్రతా కారణాల దృష్ట్యా మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఇదే సమయంలో ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాము అనుకుంటే అక్కడున్న నాయకులందరినీ లక్ష్యంగా చేసుకునేవారమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఖమేనీ మరణంతో ప్రజలు అనుభవిస్తున్న బాధను అమెరికా ఎప్పటికీ అర్థం చేసుకోలేదని, చరిత్ర, నాగరికత పట్ల గౌరవం లేదని ఇరాన్ విమర్శించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!