
జనరల్

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రస్తుతం ఇది బాలాసోర్కు సుమారు 50 కిలోమీటర్లు, చాంద్బలి, దిఘాలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో బాలాసోర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశముండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని APSDMA సూచించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!