

బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, అలియా భట్ ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీనటులలో ఒకరిగా నిలుస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక 'రామాయణ' చిత్ర సిరీస్లో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ ఒక్కో భాగానికి ₹75 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రెండు భాగాలకు కలిపి ఆయన ₹150 కోట్లకు పైగా అందుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పారితోషికంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు అలియా భట్, యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో రూపొందుతున్న తొలి మహిళా ప్రధాన చిత్రం 'ఆల్ఫా' కోసం ₹25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో ఆమె సూపర్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. భారీ విజయాలు అందించిన ట్రాక్ రికార్డు, భారీ ఫ్రాంచైజీలను ముందుకు నడిపించే సామర్థ్యం, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే క్రేజ్ కారణంగానే నిర్మాతలు వీరికి భారీ పారితోషికాలు చెల్లించడానికి సిద్ధమవుతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!