
బిజినెస్

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, వెట్టి చాకిరీ ద్వారా తయారైన వస్తువుల దిగుమతులపై నిషేధం సరైన రీతిలో అమలు కావడం లేదనే కారణంతో భారత్ సహా దాదాపు 60 దేశాలపై కొత్త సుంకాలను విధించింది. ఈ సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 301 ప్రకారం తాత్కాలిక టారిఫ్ గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే భారత్ కు కొంత ఉపశమనం లభించింది. ప్రారంభంలో 12.5 శాతం టారిఫ్ ప్రతిపాదించినప్పటికీ, వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలులో పురోగతిని దృష్టిలో ఉంచుకుని దాన్ని 10 శాతానికి తగ్గించారు. చమురు, సహజ వాయువు, ఎరువులు మరియు యూఎస్-మెక్సికో-కెనడా ఒప్పంద పరిధిలోని వస్తువులకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!