
జనరల్

పెరూలోని మధ్య జునిన్ ప్రాంతంలో శనివారం రాత్రి 5.1, 3.7 తీవ్రతలతో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తులో ఆరుగురు మృతి చెందగా, 21 మంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
రాజధాని లిమాకు తూర్పున సంభవించిన ఈ భూకంపాల ప్రభావంతో సుమారు 48 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, దాదాపు 300 మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!