

హల్ద్వానీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన అనంతరం ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడాన్ని తెలంగాణ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దళిత నాయకుడు ప్రసంగించిన వేదికను అనంతరం శుద్ధి చేయాల్సిన ప్రదేశంగా చూపించడం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాదని, తరతరాలుగా వివక్ష, సామాజిక వెలివేతను ఎదుర్కొన్న కోట్లాది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగం సమానత్వం, గౌరవాన్ని హామీ ఇస్తున్న సమయంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు.
ఈ ఘటనను ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, దానిని ప్రశ్నించిన వ్యక్తిపై కేసు పెట్టడం న్యాయాన్ని తలకిందులు చేయడమేనన్నారు. ఎఫ్ఐఆర్లతో సత్యాన్ని లేదా ప్రజాస్వామ్య ప్రశ్నలను అణచివేయలేరని, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం దేశానికి మార్గదర్శకంగా ఉండాలని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!