

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా 172కు పైగా రహదారులు మూసుకుపోయాయి. దీంతో అంబులెన్స్లు సహా పలు వాహనాలు మార్గమధ్యలో నిలిచిపోయాయి. గౌలా, కోసి, బిన్, క్షిపా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. పౌడీ జిల్లాలోని కోట్ద్వార్ సమీపంలో కొల్హు నదిని దాటుతుండగా ఓ తల్లి, ఆమె ఏడాదిన్నర చిన్నారి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. అల్మోరా జిల్లా ఉదయ్ ఉడా గ్రామంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ధార్ ప్రాంతంలో ఇద్దరు నేపాలీ కార్మికులు మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!