

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆమె ఆరోపించారు. ఈ 1000 రోజుల పాలనలో పేదలు, నిరుద్యోగులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు, సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు వంటి అంశాలను కవిత ప్రస్తావించారు. ఉద్యమకారుల నెత్తురు చిందిన నాటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తూ, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!