
జనరల్

అమెరికా దళాలు భారత నౌకపై జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ శ్రీ పట్నాల సురేష్ దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఒమన్ తీరానికి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ తీవ్ర సంతాపం తెలిపారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!