

ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య సంబంధంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. పలు ఈవెంట్లలో కలిసి కనిపించడం, వైరల్ వీడియోలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. అయితే తాజాగా ఫిల్మ్ఫేర్ ప్రచురించిన కథనం ప్రకారం, వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. సన్నిహిత వర్గాల ప్రకారం ఇద్దరూ తమ తమ మార్గాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై ధనుష్, మృణాల్ ఇప్పటివరకు స్పందించలేదు.
ఈ రూమర్లు మొదటగా సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ సందర్భంగా ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ధనుష్, మృణాల్ మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణ వీడియో వైరల్ అయింది. తరువాత తేరే ఇష్క్ మేన్ ర్యాప్-అప్ పార్టీలో మృణాల్ కనిపించడం, అలాగే ధనుష్ సోదరీమణులను ఫాలో కావడం ఈ ప్రచారానికి మరింత బలం ఇచ్చింది. అయితే గతంలో ఈ రూమర్లను మృణాల్ ఖండిస్తూ, ధనుష్ తనకు మంచి స్నేహితుడేనని తెలిపింది. అజయ్ దేవగన్ ఆహ్వానం మేరకే కార్యక్రమానికి హాజరైనట్లు స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితంపై కాకుండా సినిమాలపై దృష్టి పెట్టాలని ఆమె కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!