
సినిమాలు

విశాఖపట్నంలోని అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ నిర్మాణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి చేరుకున్న మంత్రికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పీవీ సింధు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి మంత్రి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ నమూనాను పరిశీలించిన మంత్రి, క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రజెంటేషన్ను కూడా వీక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!