
రాజకీయాలు

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ‘స్పిరిట్’లోని కొన్ని సన్నివేశాలు చూశానని, అవి అద్భుతంగా ఉన్నాయని భూషణ్ కుమార్ తెలిపారు. ఇది ఒక పోలీస్ కథ అయినప్పటికీ, సందీప్ రెడ్డి వంగా దాన్ని పూర్తిగా కొత్త శైలిలో, ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!