
ఓటీటీ

కుటుంబ ప్రేక్షకులను, ఓవర్సీస్ ఆడియన్స్ను తన ప్రత్యేకమైన కథలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, ‘కుబేర’ విజయానంతరం మరో కొత్త ప్రాజెక్ట్కు సిద్ధమైనట్లు సమాచారం. ఏషియన్ సునీల్ నిర్మించనున్న ఈ సినిమా కోసం ఆయన ఇప్పటికే కొత్త కథను పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే హీరో ఎంపిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు వరుస చిత్రాలతో బిజీగా ఉండటంతో శేఖర్ కమ్ముల పలువురు నటులకు కథ వినిపించే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాను పర్ఫెక్ట్గా తీర్చిదిద్దే విషయంలో రాజీ పడని శేఖర్ కమ్ముల, తన ప్రాజెక్ట్కు హీరో నుంచి ఎక్కువ సమయం కోరుతారని తెలిసిందే. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!