
గాసిప్స్

ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మెహర్ రమేష్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ క్రేజీ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన కొంత షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ‘భోళా శంకర్’ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమా రాకపోవడంతో ఈ వార్త ఆసక్తిని పెంచుతోంది.
ఇది మెహర్ రమేష్కు నటుడిగా తొలి అనుభవం కాదు. గతంలో మహేష్ బాబు నటించిన ‘బాబీ’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. అయితే ఈసారి కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్త చర్చనీయాంశమైంది. మరోవైపు దర్శకుడిగానూ కొత్త కథను సిద్ధం చేసుకుని హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో మెహర్ రమేష్ ఇకపై కెమెరా వెనకాలే కాకుండా కెమెరా ముందూ సందడి చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!