
జనరల్

తమిళ నటుడు అథర్వా ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా టాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తారని అభిమానులు భావించినప్పటికీ, అది జరగలేదు. తాజాగా ‘హృదయం మురళి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై స్పందించారు.
‘గద్దలకొండ గణేష్’ తర్వాత తనకు అనేక తెలుగు సినిమాల అవకాశాలు వచ్చినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా షెడ్యూల్ పూర్తిగా మారిపోయిందని అథర్వా తెలిపారు. అప్పటికే కొన్ని తమిళ చిత్రాలకు కమిట్ కావడంతో వాటినే పూర్తి చేయాల్సి వచ్చిందని, అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయానని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!