

పెద్ద కుమార్తె అవంతిక వివాహం చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శ్రవణ్ శ్రీనివాసన్తో గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తమ సతీమణులు సురేఖ, అమల, నీరజలతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సినీ ప్రముఖులు నూతన దంపతులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, నటి త్రిష కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దీంతో 1980, 1990 దశకాల సినీ తారలు ఒకే వేదికపై కనిపించిన అరుదైన సందర్భంగా ఈ వేడుక నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!