

దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం ‘డీసీ’ని ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మొదట జూలై 31న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా చిత్రబృందం కీలక అప్డేట్ను వెల్లడించింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రకటించింది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలు, హింసాత్మక అంశాల కారణంగా ఈ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విడుదలను వారం రోజులు వాయిదా వేసి ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. లోకేష్ నటన, అరుణ్ మాతేశ్వరన్ యాక్షన్ ట్రీట్మెంట్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!