
సినిమాలు

ముద్రగడ పద్మనాభం మరణానికి ముందు తనతో పంచుకున్న చివరి కోరికలను ఆయన కుమారుడు గిరిబాబు భావోద్వేగంగా వెల్లడించారు. తనను ఇంటి ప్రాంగణంలోనే ఖననం చేయాలని, అలా చేస్తే తాను ఎప్పటికీ అక్కడే ఉంటానని తండ్రి చెప్పారని తెలిపారు. అలాగే తన మరణానంతరం ఎలాంటి కర్మకాండలు లేదా కార్యక్రమాలు నిర్వహించవద్దని కోరినట్లు వెల్లడించారు.
రాజకీయాల్లో కుటుంబ పేరుపై ఆధారపడకుండా స్వంతంగా గుర్తింపు సంపాదించాలని, ప్రజాసేవలో నిబద్ధత, నిజాయితీ ఎంతో ముఖ్యమని తండ్రి తనకు సూచించినట్లు గిరిబాబు చెప్పారు. ఆయన జీవిత అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలని కూడా తండ్రి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!