

ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ‘అవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తొలి రోజు భారత్లో రూ.23.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో ఇమ్రాన్ హష్మీ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రాల జాబితాలో ‘అవారాపన్ 2’ మూడో స్థానంలో నిలిచినట్లు చెబుతున్నారు. ‘దే కాల్ హిమ్ ఓజీ’, ‘టైగర్ 3’ చిత్రాలు తొలి రోజు వసూళ్లలో అతడి కంటే ముందున్నాయి.
ఎన్నో ఏళ్ల తర్వాత రోనీ మాలిక్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ తిరిగి రావడంతో ‘అవారాపన్ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఓపెనింగ్ చిత్రానికి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తొలి రోజు వసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో రానున్న రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తుందా, భారీ విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!