
షోస్

నటి పూనమ్ పాండే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. భారత్లో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యభిచారాన్ని చట్టబద్ధ పరిధిలోకి తీసుకురావడం వల్ల మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అన్యాయాలు తగ్గే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా, తాను రూపొందించే అడల్ట్ కంటెంట్పై కూడా పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వీడియోలు పురుషులకు మానసిక ఉపశమనం కలిగిస్తాయని, దాంతో మహిళలపై తప్పుగా ప్రవర్తించాలనే ఆలోచనలు తగ్గుతాయని ఆమె అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు ఇది పూనమ్కు మరో వివాదాన్ని తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!