

టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మిస్టీరియస్ థ్రిల్లర్ ‘వదలా’ విడుదలకు సిద్ధమైంది. అకెళ్లవి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్తో పాటు చిత్రబృందం షేర్ చేసిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఒక ప్రశాంతమైన ఇంట్లోకి ప్రవేశించే చీకటి శక్తి తర్వాత పరిస్థితులు ఎలా మారతాయన్న హింట్తో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబం చుట్టూ తిరిగే మిస్టీరియస్ సంఘటనల నేపథ్యంలో ఈ థ్రిల్లర్ రూపొందినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో లయ రీఎంట్రీ ఇస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!