

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన భారత్ భాగ్య విధాత చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రారంభ వీకెండ్లో మోస్తరు స్పందన లభించినప్పటికీ, సోమవారం కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నాలుగో రోజు ఈ సినిమా కేవలం రూ.65 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఆదివారం నమోదైన రూ.1.8 కోట్ల వసూళ్లతో పోలిస్తే ఇది దాదాపు 64 శాతం తగ్గుదలగా పేర్కొంటున్నారు.
మనోజ్ తపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముంబైలోని కామా ఆసుపత్రిలో 26/11 దాడుల సమయంలో నర్సు అంజలి కుల్తే ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధానంగా చూపిస్తుంది. కథ, భావోద్వేగాల పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో సినిమా విఫలమైంది. తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా సుమారు రూ.4.9 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఇతర కొత్త చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!