

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ‘కింగ్ ఆఫ్ కోథా’ పరాజయం తన కెరీర్పై, మానసిక ధైర్యంపై తీవ్ర ప్రభావం చూపిందని నటి ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన నటన, డైలాగ్ డెలివరీపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదురయ్యాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా దుల్కర్ పాత్రను ‘రాజువెట్టా’ అని పిలిచిన సన్నివేశంపై కూడా నెటిజన్లు ఎగతాళి చేశారని చెప్పారు.
ట్రోలింగ్ తనపై ఎంతగా ప్రభావం చూపిందంటే.. దుల్కర్తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశాన్ని కూడా భయంతో తిరస్కరించినట్లు ఐశ్వర్య వెల్లడించారు. తాను నటిస్తే మరోసారి తీవ్ర విమర్శలు రావచ్చని భావించి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. ‘హలోమమ్మీ’ సినిమా షూటింగ్ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తనను వెక్కిరించిన ఘటన కూడా ఎంతో బాధించిందని తెలిపారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో సుమారు రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘కింగ్ ఆఫ్ కోథా’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి సాయి దుర్గా తేజ్కు జోడీగా ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో నటిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!