

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని సినీ వర్గాల సమాచారం. ముందుగా అనుకున్న బడ్జెట్ పరిధిలోనే చిత్ర నిర్మాణం కొనసాగుతోందని, ప్రశాంత్ నీల్ ఊహించిన భారీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నిర్మాణ విలువల విషయంలో మేకర్స్ రాజీ పడటం లేదని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, బడ్జెట్ అదుపు తప్పలేదని టాక్.
ఇక ‘డ్రాగన్’లో ప్రశాంత్ నీల్ తన గత సినిమాలకు భిన్నమైన విజువల్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర గతాన్ని ఆవిష్కరించే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఎంతో రంగులమయంగా ఉంటుందని టాక్. సాధారణంగా నీల్ సినిమాల్లో కనిపించే డార్క్, గ్రే షేడ్స్కు భిన్నంగా ఈ భాగాన్ని కొత్త తరహా ఫ్రేమ్స్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాష్బ్యాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!