

ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా అగ్రస్థానంలో నిలిచిన పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్లో కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. 2021లో విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తర్వాత ఆమెకు సరైన విజయం దక్కలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేసినప్పటికీ ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘దేవా’, ‘రెట్రో’, తాజాగా విడుదలైన ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి.
అయితే వరుస పరాజయాలు ఎదురైనా పూజా హెగ్డేకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె ‘కాంచన 4’లో నటిస్తుండగా, విజయ్ హీరోగా రూపొందిన ‘జననాయగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలపై పూజా భారీ ఆశలు పెట్టుకుంది. ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయాన్ని ఈ సినిమాల్లో ఏదో ఒకటి అందిస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!