

‘రోమాంచకం’ ట్రైలర్కు ప్రభాస్ నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ట్రైలర్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ప్రభాస్.. ఇది చాలా ఫన్గా, ఎంటర్టైనింగ్గా ఉందని పేర్కొన్నారు. ట్రైలర్ను తాను పూర్తిగా ఆస్వాదించానని తెలిపారు. సెప్టెంబర్ 3న థియేటర్లలో ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు మంచి సమయాన్ని గడుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్రబృందానికి ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’కు వేణు గోపాల్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్పై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రభాస్ ప్రశంసలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!