

‘బాహుబలి’తో భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఇప్పుడు ‘బాహుబలి ఎటర్నల్ వార్’ యానిమేషన్ ప్రాజెక్ట్పై కీలక విషయాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్కు తానే దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బాహుబలి ప్రపంచాన్ని మరింత విశాలంగా, అద్భుతంగా ఆవిష్కరించాలంటే యానిమేషన్ ఉత్తమ మాధ్యమమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ బాధ్యతను మరో దర్శకుడికి అప్పగించినట్లు వివరించారు.
దర్శకుడు ఇషాన్ శుక్లా కథలోని భావోద్వేగాలను, పాత్రల లోతును అద్భుతంగా అర్థం చేసుకున్నారని రాజమౌళి తెలిపారు. భారతీయ సంస్కృతి, రంగుల వైభవం, కల్పిత ప్రపంచాన్ని మరింత గొప్పగా చూపించేందుకు యానిమేషన్ అనువైన రూపమని చెప్పారు. ప్రత్యక్ష చిత్రీకరణలో సాధ్యం కాని అనేక అద్భుత దృశ్యాలను ఈ ఫార్మాట్లో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించవచ్చని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా బాహుబలి విశ్వాన్ని కొత్త కోణంలో పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!