

భారతీయ సినీ పరిశ్రమలో నటుల పారితోషికాల లెక్కలు రోజురోజుకూ కొత్త స్థాయికి చేరుతున్నాయి. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రంతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹3,200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, భారతదేశంలోనే ₹1,900 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం రణ్వీర్ సింగ్ ముందస్తు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా పద్ధతిని ఎంచుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ వసూళ్లు, డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, మ్యూజిక్ రైట్స్ మరియు బోనస్ల ద్వారా ఆయన వాటా సుమారు ₹325 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంఖ్యలు నిజమైతే, ఒకే ప్రాజెక్ట్ ద్వారా అత్యధిక ఆదాయం అందుకున్న భారతీయ నటుడిగా రణ్వీర్ సింగ్ కొత్త రికార్డు నెలకొల్పినట్టే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!