
సినిమాలు

ప్రస్తుతం టాలీవుడ్లో కమర్షియల్ సినిమాల హవా పెరుగుతుండటంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల మార్కెట్ గణనీయంగా తగ్గింది. అనుష్క నటించిన భారీ చిత్రం ‘ఘాటీ’ ఇటీవల కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో మహిళా ప్రధాన చిత్రాలకు థియేటర్లలో ఆదరణ తగ్గిందనే ఆందోళన మరింత పెరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ ఈ వారం విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో సమంత–నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ఓ బేబీ’ హిట్ కావడం ఈ సినిమాకు పెద్ద బలంగా మారింది. అయితే ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ మధ్య ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఇప్పటికే నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా సుమారు రూ.30 కోట్లు రాబట్టి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!