
రాజకీయాలు

శింబు హీరోగా, జ్యోతిక హీరోయిన్గా నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 2004లో తమిళంలో ‘మన్మధన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించగా, తెలుగులో ‘మన్మధ’ పేరుతో విడుదలై టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శింబు స్వయంగా స్క్రీన్ప్లే అందించగా, యువన్ శంకర్ రాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల రీ-రిలీజ్ అయిన పలు డబ్బింగ్ చిత్రాలు మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో, ‘మన్మధ’ కూడా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!