
జనరల్

శ్రీనివాస మంగాపురం చిత్రంలోని ‘గుండె పేలిపోతోందే’ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమ భావాలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన ఈ మెలోడీ ఇప్పటికే సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ అందించిన సాహిత్యానికి, అనురాగ్ కులకర్ణి తన మధుర గాత్రంతో ప్రాణం పోశారు.
ఈ పాటకు సంగీత సంచలనం జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. ప్రేమ, అనురాగం, భావోద్వేగాల మేళవింపుగా రూపొందిన ఈ గీతం సినిమా విడుదలకు ముందే మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. జూలై 9న ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీనివాస మంగాపురంపై ఈ పాట మరింత ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!