
బిజినెస్

అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్య నగరంగా అధికారికంగా ఖరారైంది. ఢిల్లీ 2010 తర్వాత భారత్ రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలకు వేదిక కానుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా ఈ పోటీల శతాబ్ది వేడుకలు కూడా జరగనున్నాయి. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచి క్రీడా రంగంలో మంచి ప్రదర్శన కనబరిచింది.
అయితే ఢిల్లీ గేమ్స్ అవినీతి ఆరోపణలు, అధిక వ్యయాలు, విచారణల కారణంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. అహ్మదాబాద్ 2030 గేమ్స్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన నిర్వహణ, భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో గుర్తుండిపోయేలా ఉండాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!