

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఈ శుక్రవారం గ్రాండ్గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య, వెంకీ అట్లూరితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసిన తర్వాత వెంకీ అట్లూరి చెప్పే ఏ కథకైనా తాను ఓకే చెప్పేవాడినని, ఆయనతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని సూర్య తెలిపారు.
అయితే అంతకుముందే వెంకీ అట్లూరి ఓ బయోపిక్ స్క్రిప్ట్తో తనను సంప్రదించారని సూర్య వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని చెప్పారు. దీంతో సూర్యతో వెంకీ తెరకెక్కించాలనుకున్న బయోపిక్ ఎవరిపై అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. తన గత రెండు చిత్రాలు పిరియాడిక్ నేపథ్యంతో సాగడంతో మరోసారి అదే తరహా కథ చేస్తే రొటీన్గా అనిపించే అవకాశం ఉందని వెంకీ భావించి ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సూర్య కూడా మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని కోరుకోవడంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్పై భారీ అంచనాలను పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!