

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇడుపు కాయితం” అనౌన్స్మెంట్ నుంచే చర్చలకు దారి తీసింది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పిస్తుండగా, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.
తెలంగాణ మాండలికంలో “ఇడుపు కాయితం” అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉండటంతో ఈ టైటిల్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలు విడిపోవాలనే సమయంలో ఊరి పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రాన్ని ఈ పదం సూచిస్తుందని స్థానికంగా అర్థం. ఇలాంటి సున్నితమైన పదాన్ని టైటిల్గా పెట్టడంపై చర్చలు మొదలయ్యాయి.
ఈ వివాదం ఆంధ్రా–తెలంగాణ ప్రాంతీయ చర్చలుగా కూడా మారింది. అయితే నిర్మాత బన్నీ వాస్ స్పందిస్తూ, సినిమా టైటిల్ కథ నేపథ్యాన్ని బట్టి మాత్రమే నిర్ణయించబడిందని, వివాదాలపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. సినిమా విడుదలైన తర్వాతే అసలు విషయం ప్రేక్షకులకు అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!