

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రాయలసీమ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉండగా, సెప్టెంబర్ 11న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ షూటింగ్ కోసం ఐదు నుంచి ఆరు క్యారవాన్లు కోరారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. ప్రముఖ వార్తా సంస్థల పేర్లతో నకిలీ స్క్రీన్షాట్లు కూడా వైరల్ అయ్యాయి.
ఈ ప్రచారంపై స్పందించిన నిర్మాత రవి, మూవీ టీమ్ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి రూమర్స్ను నమ్మవద్దని, షేర్ చేయవద్దని ప్రేక్షకులను కోరుతూ, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!