
గాసిప్స్

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ విజయవంతంగా 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై టీ సిరీస్ సమర్పణలో భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.
ఇటీవల గండికోటలో కీలక షెడ్యూల్ పూర్తిచేసిన చిత్రబృందం, విజయ్ దేవరకొండ – రష్మికా మధ్య భావోద్వేగ సన్నివేశాలను చిత్రీకరించింది. ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. విజయ్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు చిత్రబృందం సిద్ధమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!