

తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. తాజాగా వచ్చిన ట్రైలర్లో ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది.
సూర్య ఈ చిత్రంలో ‘సంజయ్ విశ్వనాథ్’ అనే షూటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన సరికొత్త లుక్లో దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలో సూర్య, మమితా బైజు మధ్య చిగురించే ప్రేమను సున్నితంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాలను కూడా దర్శకుడు కథలో కీలకంగా మలిచినట్లు కనిపిస్తోంది. ట్రైలర్లోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సూర్య నటనకు మరోసారి మంచి ప్రశంసలు దక్కే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!