

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా రూపొందుతున్న మిస్టికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘విరూపాక్ష’ విజయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది. మిస్టరీ, ఆధ్యాత్మికత, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సంస్థ జీ నెట్వర్క్ ఈ హక్కులను దాదాపు 48 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ డీల్ నిజమైతే నాగచైతన్య కెరీర్లోనే ఇది అతిపెద్ద వ్యాపార ఒప్పందంగా నిలవనుంది. విడుదలకు ముందే చిత్ర బడ్జెట్లో గణనీయమైన భాగం తిరిగి రావడంతో నిర్మాతల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. 2026 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!