

90వ దశకంలో టెలివిజన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన కల్ట్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘మర్మదేశం’ ఇప్పుడు కొత్త అధ్యాయంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వీరభద్రుని రహస్యం’ పేరుతో రూపొందిన ఈ సిరీస్ జూన్ 26 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ నేపథ్యం, జానపద కథలు, మిస్టరీ అంశాలు, ఉత్కంఠభరిత కథనంతో అప్పట్లో సంచలనం సృష్టించిన ‘మర్మదేశం’ ఫ్రాంచైజీకి ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది.
ఈ కొత్త సిరీస్ వీరభద్ర స్వామికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందింది. దర్శకుడు నాగ ఆధునిక కథన శైలితో పాటు ఒరిజినల్ సిరీస్లోని సస్పెన్స్ ఎలిమెంట్స్ను కొనసాగించే ప్రయత్నం చేశారు. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ సిరీస్లో సీనియర్ నటులతో పాటు కొత్త ప్రతిభ కూడా కనిపించనుంది. అత్యుత్తమ నిర్మాణ విలువలు, ఆకట్టుకునే విజువల్స్, బింజ్-వాచ్ ఫార్మాట్తో ‘వీరభద్రుని రహస్యం’ ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!