

నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ నేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా, బూత్ స్థాయి కార్యకలాపాలపై నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే లక్ష ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఓటర్ల జాబితా తుది రూపం దాల్చే వరకు పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. ఓట్ల తొలగింపునకు సంబంధించిన అనుమానాస్పద అంశాలను గుర్తించి, అవసరమైన చోట అభ్యంతరాలు నమోదు చేయాలని కోరారు. పనిచేయని బూత్ లెవల్ ఏజెంట్లను తొలగించి, చురుకైన వారిని నియమించాలని సూచించారు. ప్రతి ఎన్నికలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆమె అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!