

ఇన్నాళ్లు వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కుతున్న ‘షాక్: ట్రస్ట్ నో వన్’ వెబ్ సిరీస్తో ఆమె డిజిటల్ అరంగేట్రం చేయనున్నారు. ‘హిచ్కీ’ ఫేమ్ సిద్ధార్థ్ మల్హోత్రా క్రియేటర్గా వ్యవహరిస్తుండగా, రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతితో పాటు జెనిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్, సోని రజ్దాన్, సుమీత్ వ్యాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ఈ నెల 24న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ కథ ఐదేళ్ల వయసులో అదృశ్యమైన తన కూతురి కోసం తొమ్మిదేళ్లుగా వెతుకుతున్న ఓ తల్లి చుట్టూ తిరుగుతుంది. కూతురికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న కొద్దీ, తనకు అత్యంత సన్నిహితులైన వారిపైనే ఆమెకు అనుమానాలు మొదలవుతాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుమానించాలి అనే ఉత్కంఠభరితమైన అంశాలతో సాగే ఈ సిరీస్లో మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్కు ప్రాధాన్యం ఇచ్చారు. చివరి వరకు ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచేలా ఈ థ్రిల్లర్ను రూపొందించినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!