

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్ సిద్ధమైంది. తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన తెలుగు సిరీస్ ‘పంచనామా’కు మోహన్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఉదయ భాను ప్రొడక్షన్స్ పతాకంపై మిద్దె విజయేంద్ర మౌళి, ఉదయభాను ఈ సిరీస్ను నిర్మించారు. సెప్టెంబరు 11 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్ను విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తే.. ఆద్యంతం ఉత్కంఠను పంచేలా ఈ సిరీస్ను క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం వెనుక అసలు కారణం ఏంటి? ఈ కేసును పోలీస్ ఆఫీసర్గా నటించిన భరత్ ఎలా ఛేదించాడు? దర్యాప్తు సమయంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు సిరీస్లోనే తెలియనున్నాయి. శివాజీ రాజా, మేథారెడ్డి, చరణ్బాబు, రూప లక్ష్మి, రాధికా ప్రీతి, సూర్య, శ్రీజ, మోహన్ శ్రీవాత్సవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్లో కనిపించిన సస్పెన్స్, మిస్టరీ అంశాలు సిరీస్పై ఆసక్తిని పెంచుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!