
రాజకీయాలు

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీనే "అసలైన సనాతన పార్టీ" అని పేర్కొన్నారు. సనాతన ధర్మం, శ్రీరాముడిని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుందని ఆరోపించారు. ఉచిత తీర్థయాత్రలు, భక్తి కార్యక్రమాలు, ఆలయాల అభివృద్ధి వంటి చర్యల ద్వారా ఆప్ సనాతన ధర్మానికి సేవ చేస్తోందని ఆయన తెలిపారు.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి మనోభావాలను దెబ్బతీశాయని కేజ్రీవాల్ అన్నారు. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులను రక్షిస్తున్నారని ఆరోపిస్తూ, ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామాలయాన్ని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!