
సినిమాలు

న్యూఢిల్లీ లో 37 రోజుల పాటు సాగిన విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి, పరీక్ష పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించేలా చేసిన అభిజీత్ దిప్కే దేశవ్యాప్తంగా యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ధైర్యం, నాయకత్వం విద్యార్థుల్లో విశేష స్పందనను తెచ్చింది.
అమెరికాలో చదువులు పూర్తి చేసి భారత్కు తిరిగి వచ్చిన దిప్కే, విద్యార్థుల హక్కుల కోసం “కాక్రోచ్ జనతా పార్టీ” అనే యువజన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన పెరుగుతున్న ప్రజాదరణతో మహారాష్ట్రలో ఉన్న ఆయన కుటుంబానికి వివాహ ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయని తల్లి అనిత దిప్కే తెలిపారు. అయితే ప్రస్తుతం తన లక్ష్యాలపై దృష్టి సారిస్తూ, ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే వివాహంపై ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!