

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘రీల్స్లో మాత్రమే క్షమిస్తారా? లేక విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటారా?’’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో కొందరు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు వైరల్ కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, తనను, తన తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను క్షమిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలిపారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలోకి తీసుకురావడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. దీనిపై అభిజీత్ దిప్కే స్పందిస్తూ, క్షమాపణలతో పాటు విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యువత, అధికార పార్టీ నేతలకు వేర్వేరు నిబంధనలు ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!