

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయంటూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి తగ్గిందని, అంటే 5,56,666 మంది తగ్గారని తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు, ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కు తగ్గినట్లు పేర్కొన్నారు.
ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కి పెరిగిందని జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు పాఠశాల విద్యా సమాచార సమీకృత వ్యవస్థ గణాంకాలు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం బలహీనపరుస్తోందని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అధికార కూటమి ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!