

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ హర్మూజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా నుంచి భిన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ మాట్లాడుతూ హర్మూజ్ జలసంధి నిర్వహణ బాధ్యత ఇరాన్దేనని స్పష్టం చేశారు. ఈ కీలక సముద్ర మార్గం యుద్ధానికి ముందున్న పరిస్థితులకు ఎప్పటికీ తిరిగి వెళ్లదని వ్యాఖ్యానించారు. అమెరికాపై తమకు ఎప్పటినుంచో విశ్వాసం లేదని, భవిష్యత్తులో కూడా అదే వైఖరి కొనసాగుతుందని చెప్పారు.
స్విట్జర్లాండ్లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయని, సుమారు 12 బిలియన్ డాలర్ల ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదలకు సంబంధించి తుది ఒప్పందం కుదిరిందని ఘాలిబఫ్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉందని తెలిపారు. జలసంధికి ఆనుకుని ఉన్న ఒమన్ దేశం అంతర్జాతీయ చట్టాలు, నిరాటంక సముద్ర రవాణాకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. అలాగే ఇరాన్-అమెరికా మధ్య తాజా అవగాహనపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!