
జనరల్

బాల్యవివాహాలను సమర్థవంతంగా అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించే నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే వివాహానికి ముందు వధూవరుల వయస్సును సులభంగా ధృవీకరించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే ఈ విషయాన్ని వెల్లడించారు. బాల్యవివాహాల నియంత్రణలో భాగంగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి, అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ చర్య అమలైతే బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!