

గురు పూజోత్సవం సందర్భంగా ఏపీ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ‘గురు పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సాయంత్రం వరకు దీక్ష కొనసాగించారు. ఏపీ డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అనర్హులు కూడా టీచర్లుగా ఉద్యోగాలు పొందారని ఆయన అన్నారు.
అనర్హులు పాఠాలు చెబితే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హతతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాలని తాము కోరడం లేదని, అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహిస్తే అనర్హులు బయటపడతారని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!